థియేటర్లలో ‘హుషారు’ ఫేమ్ మూవీ..?

హుషారు సినిమాతో సందడి చేసిన దినేష్ తేజ్ ‘మెరిసే మెరిసే’ అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. పవన్ కుమార్ కె. డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు.

సినిమాలో దినేష్ తేజ్ సరసన శ్వేతా అవస్తి హీరోయిన్ గా నటించింది. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దర్శకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ..నిర్మాత వెంకటేష్ కొత్తూరి సహకారంతో ‘మెరిసే మెరిసే’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం..ఇటీవలే సెన్సార్ వారు మా సినిమా చూసి అభినందించి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చారని..హీరో, హీరోయిన్ లు కూడా చాలా బాగా నటించారని చెప్పుకొచ్చాడు. ఆగస్టు 6న సినిమా విడుదల చేస్తున్నామని సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.