టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బర్త్డే అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజున మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అందరూ భావించారు.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మహేష్ బర్త్డేకి డబుల్ ట్రీట్ రాబోతోందట. సర్కారు వారి పాట ఫస్ట్ గ్లిమ్స్ వీడియో మరియు ఓ పోస్టర్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. మరి ఇదే నిజమైతే.. మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.