టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవెల మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సుకుమార్ కారణంగా ఈ చిత్రం షూటింగ్కు మళ్లీ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు గత రెండు రోజులుగా జ్వరం ఉందని.. ఈ క్రమంలోనే ఆయన ఆస్వస్తతకు గురయ్యారని సమాచారం.
ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారట. ఇక సుకుమార్ పూర్తి కోలుకున్న తర్వాత పుష్ప షూటింగ్ రీస్టార్ట్ కానుందని తెలుస్తోంది. కాగా, రెండు భాగాలుగా రాబోతున్న పుష్ప చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించనున్నాడు.