బాల‌య్య షాకింగ్ నిర్ణ‌యం..నిరాశ‌లో అనిల్ రావిపూడి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెక్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అఖండ త‌ర్వాత గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాలని బాల‌య్య ప్లాన్ చేసుకున్నాడు.

అలాగే గ‌త కొన్ని రోజుల నుంచి బాల‌య్య‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే అనిల్ రావిపూడి త‌ర్వాత పూరీ సినిమా ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బాల‌య్య ప్లాన్ మారింద‌ని తెలుస్తోంది.

గోపీచంద్ మాలినేని త‌ర్వాత పూరీతో సినిమా చేయాల‌ని బాల‌య్య నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇప్పటికే పూరి జగన్నాధ్ ఓ ఇంట్రెస్టింగ్ కథను బాలకృష్ణకు చెప్పగా.. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ట. ఈ నేప‌థ్యంలోనే పూరి సినిమా ముందు చేయాల‌ని బాల‌య్య డిసీష‌న్ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక బాల‌య్య నిర్ణ‌యంతో అనిల్ కాస్త నిరాశ‌కు గుర‌య్యార‌ని టాక్‌.