రామ్ కోసం రంగంలోకి దిగిన‌ ప‌వ‌న్ మేన‌త్త?!

న‌దియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అత్తారింటికి దారేది మూవీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మేన‌త్త‌గా న‌టించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారీమె. ఈ చిత్రం త‌ర్వాత ఆమె మ‌రెన్నో ఆఫ‌ర్లు కూడా ద‌క్కాయి. అయితే ఇప్పుడు న‌దియా టాలీవుడ్ ఎన‌ర్జిటివ్ రామ్ పోతినేని కోసం రంగంలోకి దిగింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తె.. రామ్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుసామితో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రంలో న‌దియా ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈమె లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న నదియా ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా అన్పిస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రామ్, కృతీ శెట్టి, కీలక పాత్రధారి నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Image