టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేషన్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శర్వానంద్, రష్మిక మందన్న, డైరెక్టర్ తిరుమల కిషోర్ తదితరులు కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. కాగా, శర్వా అజయ్ భూపతి దర్వకత్వంలో మహా సముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఒకే ఒక జీవితం చిత్రంలోనూ శర్వా నటస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.