ప్రారంభ‌మైన శ‌ర్వా-ర‌ష్మిక‌ల మూవీ షూటింగ్‌..పిక్‌ వైర‌ల్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Adavaallu Meeku Joharlu shoot begins | Telugu Cinema

అయితే ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేష‌న్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ తిరుమల కిషోర్ త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు.

Sharwanand shares PHOTOS from the launch of his next film Aadaalloo Meeku  Johaarlu with Rashmika Mandanna | PINKVILLA

ప్ర‌స్తుతం ఈ పిక్ వైర‌ల్ గా మారింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. కాగా, శ‌ర్వా అజ‌య్ భూప‌తి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హా స‌ముద్రం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఒకే ఒక జీవితం చిత్రంలోనూ శ‌ర్వా న‌ట‌స్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది.