రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ అంటే తెలియని వారుండరు. బాహుబలి, భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి చిత్రాలకు కథ, కథనాలను అందించి.. సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్గా ఉన్న విజయేంద్ర ప్రసాద్.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కథ రాయడం కష్టమని వ్యాఖ్యానించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈటీవీలో ప్రసారమౌతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ ప్రోగ్రామ్లో ఎన్నో విషయాలు పంచుకున్న ఈయన.. మహేష్ కి కథ రాయడం చాలా టఫ్ జాబ్ అని తెలిపారు. అలాగే మహేష్ కి కథ రాయాలి అంటే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సలహా తీసుకోవాలని చమత్కరించారు. కాగా, త్వరలోనే మహేష్తో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మరి రాజమౌళి ప్రతి సినిమాకు కథ అందించే విజయేంద్ర ప్రసాద్.. మహేష్ సినిమాకు ఎలాంటి కథ అందిస్తాడో చూడాలి.