కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు హైకోర్టు సైత్ ఈ మందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇక పోలీసులు ఉంచిన రహస్య ప్రాంతం నుంచి ఆనందయ్య కూడా ఇంటికి చేరారు.
అంతేకాదు మందు పంపిణీపై కీలక ప్రకటన చేశారు ఆనందయ్య. కరోనా పాజిటివ్ ఉన్నవారెవరూ మందుకోసం రావద్దని కోరారు. అధికారుల సహకారంతో మందును ఎక్కడికక్కడ పంపిణీ చేస్తామని తెలిపారు.
మరో మూడు రోజుల్లో ప్రభుత్వ అధికారులతో తమ కుటుంబసభ్యులు చర్చిస్తారని… ఆ తర్వాత, మందును ఎప్పటి నుంచి పంపిణీ చేస్తాననే విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అందరికీ మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు.