మెగా కోడలుగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల త్వరలోనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతోందని ఈ టాక్ బయటకు వచ్చింది.
కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారు వైద్యులు. అటువంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కబోతోందట.
అంతేకాదు, ఈ షార్ట్ ఫిల్మ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ హీరోలుగా కనిపించనున్నారట. ఇక ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.