దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కంటే ముందే జక్కన్న నుంచి మరో మూవీ ప్రేక్షకులను పలకరించనుందట. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే మరో సినిమా చేస్తారా? అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అవును, మీ అనుమానం నిజమే.
కానీ, రాజమౌళి చేయబోయేది ఫీచర్ ఫిల్మ్ కాదు.. షార్ట్ ఫిల్మ్ అని సమాచారం. కొవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పతనాన్ని తెలియజేసేలా రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ను రూపొందించనున్నారు. ఇరవై నిమిషాల వ్యవధితో ఈ షార్ట్ ఫిల్మ్ ఉండబోతోందట. ఇక ఈ షార్ట్ ఫిల్మ్పై త్వరలోనే అన్ని వివరాలు బయటకు రానున్నాయి.