ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్ పాటు బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి.. మళ్లీ మునుపటి జోష్తోనే ముందుకు వెళ్తోంది.
ప్రస్తుతం ఈమె వెంకటేష్తో నారప్ప, రానాతో విరాటపర్వం, అజయ్ దేవగణ్తో మైదాన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. వెంకీతో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెంకటేష్ సరసన నటించాలనే కోరిక నాకు చాలాకాలం నుంచి ఉండేది. గతంలో ఆయన జోడీకట్టే అవకాశాలు వచ్చాయికానీ, చివరి నిమిషంలో చేజారిపోయాయి.
ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది. నా కోరిక తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకి మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. దీంతో ప్రియమణి కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.