ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కడికక్కడ ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకెండ్ వైవ్లో మరింత వేగంగా విజృంభిస్తున్న కరోనా.. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. శుభకార్యాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
అంగరంగవైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు, బర్త్డేలు ఇతరితర శుభకార్యాలు నిరాడంభరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట కూడా ఓ శుభకార్యం గప్చుప్గా జరిగిపోయింది.
ఎన్టీఆర్ తన చిన్నకొడుకు భార్గవ్ రామ్ తో ఆదివారం అక్షరాభ్యాసం జరిపించినట్లు తెలుస్తుంది. ఈ శుభకార్యం కుటుంబ సభ్యుల మధ్యే ఎంతో నిరాడంభరంగా జరిగిందని సమాచారం. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.