వెంకీ దృశ్యం 2కు భారీ న‌ష్టం..అసలేమైందంటే?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. జీతూ జోసెఫ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ‌లో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవ‌ల కూరిసిన వ‌ర్షాల‌కు కూలిపోయినట్లు స‌మాచారం. ఇక సెట్ మొత్తం డ్యామేజ్ అవ్వ‌డం, క‌రోనా ఉధృతి త‌గ్గ‌క‌పోవ‌డంతో.. బ్యాలెన్స్ షూట్ ఇప్ప‌ట్లో జ‌ర‌ప‌డం క‌రెక్ట్ కాద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

ఇందులో భాగంగా జూలై చివ‌ర్లో మిగిలిన్ షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది. కాగా, దృశ్యం 2తో పాటు వెంకీ నార‌ప్ప‌, ఎఫ్ 3 చిత్రాలు కూడా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.