రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో సలార్ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్ రోల్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో ప్రభాస్ ను డ్యూయెల్ రోల్స్ లో కనిపిస్తాడట.
అయితే క్లైమాక్స్ లో ట్విన్స్ మ్యాటర్ రివీల్ అవుతుందని ఇది చిత్రానికే హైలైట్గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది.