ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఆ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా ఆగస్ట్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందట.
పవన్ ఆగస్టు నుండి ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వడంతో.. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలు పెట్టారట. అలాగే ఈ సినిమాకు సంచారి టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కాగా, పవన్ మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహార వీరమల్లు, సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదే ఉన్న సంగతి తెలిందే..