మ‌హేష్‌తో మ‌ళ్లీ న‌టించాల‌నుంది..ఓపెన్ అయిన ప్ర‌భాస్ భామ‌!

కృతి సనన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ హీరోగా తెర‌కెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ త‌ర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి.

ఇక బాలీవుడ్‌లో వ‌రుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ‌.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ మ‌హేష్ గురించి ఒక్క ముక్క‌లో చెప్ప‌మ‌ని ప్ర‌శ్నించాడు.

Kriti Sanon shares a fun way to measure length of a room - The Statesman

అందుకు కృతి..మహేష్ బెస్ట్ అని చాలా హంబుల్ గా ఉంటారని, తనతో వర్క్ కూడా అమేజింగ్ గా ఉంటుందని తెలిపింది. అలాగే మరోసారి మహేష్ తో న‌టించాల‌నుంద‌ని కృతి ఓపెన్‌గా చెప్పింది. మ‌రి కృతికి మ‌రోసారి ఆ ఛాన్స్ వ‌స్తుందో లేదో చూడాలి.