కృతి సనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ హీరోగా తెరకెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ఇక బాలీవుడ్లో వరుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ.. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మహేష్ గురించి ఒక్క ముక్కలో చెప్పమని ప్రశ్నించాడు.
అందుకు కృతి..మహేష్ బెస్ట్ అని చాలా హంబుల్ గా ఉంటారని, తనతో వర్క్ కూడా అమేజింగ్ గా ఉంటుందని తెలిపింది. అలాగే మరోసారి మహేష్ తో నటించాలనుందని కృతి ఓపెన్గా చెప్పింది. మరి కృతికి మరోసారి ఆ ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.