జ‌గ‌ప‌తిబాబు ప‌రువు తీసిన బాబు గోగినేని..ఏం జ‌రిగిందంటే?

ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌టం బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేనికి అల‌వాటే. ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వక‌పోతే.. ఆయ‌నకు రోజు కూడా గ‌డ‌వ‌దు. ఇక తాజాగా సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ప‌రువు తీశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రం ఆనందయ్య మందు. దాదాపు ప్ర‌జ‌లంద‌రూ కూడా అదే న‌మ్మ‌కంగా ఆనంద‌య్య మందును వాడుతున్నారు.

ఇక ఇటీవ‌ల జ‌గ‌ప‌తిబాబు కూడా ఆనంద‌య్య మందుపై ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు, ఈ ఔషధాన్ని తాను ఎప్పుడో తీసుకున్నానని.. త‌నకు క‌రోనా రాలేద‌ని మీడియా పూర్వ‌కంగా వెల్ల‌డించారు. అయితే తాజాగా ఓ ఆంగ్ల సినీ వెబ్ సైట్‌లో జ‌గ‌ప‌తిబాబు త‌న పార్ట్‌న‌ర్స్ తో క‌లిసి ఆయుర్వేదిక్ బిజినెస్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని ప్ర‌చురించింది.

అయితే ఈ విష‌యాన్ని షేర్ చేస్తూ.. జగపతిబాబుపై సెటైర్లు వేశాడు బాబు గోగినేని. అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ వ్యాగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో బాబు ట్వీట్ వైర‌ల్‌గా మారింది.