`నువ్వు నేను` హీరోయిన్ అనిత సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక‌పై అలా..?!

నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనిత గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ చిత్రం త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా అనుకుంటుండగానే అనూహ్యంగా సినిమాల్లో కనిపించడం మానేసి.. ప‌లు సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

ఈ క్ర‌మంలోనే 2013లో అనిత‌ రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. ఇక ఈ మ‌ధ్యే పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా త‌ల్లి అయిన ఈ భామ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై తాను వెండితెర‌, బుల్లితెర‌కు దూరంగా ఉండాల‌ని అనుకుంటున్న‌ట్టు పేర్కొంది.

తల్లిగా తన బిడ్డపైనే పూర్తి ఏకాగ్రత ఉంచుతాన‌ని.. ఫుల్ టైమ్ అక్కడే పెట్టనున్నట్లు పేర్కొంది అనిత. కరోనావైరస్ ఉన్నా లేకపోయినా తన నిర్ణయం ఇలానే ఉండేదని అనిత చెప్పడం విశేషం. ఇక అనిత‌ నిర్ణ‌యంతో ఆమె అభిమానులు కాస్త అస‌హ‌నంగా ఉన్నారు.