లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా మారింది నయన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన నేత్రికన్ విడుదలకు సిద్దమవుతుండగా రజినీతో చేసిన అన్నాత్తే కూడా ముగింపు దశకు చేరుకుంది.
అలాగే ప్రియుడు, కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి నయన్ ఒక చిత్రం చేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మరో చిత్రానికి ఈ గ్లామర్ బ్యూటీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోందంట. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడట.
ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మేనట. అయితే ఈ చిత్రంలో నయన్కు విలన్గా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించబోతున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. కాగా, కన్నడలో పెద్ద స్టార్ అయిన సుదీప్.. ఈగ చిత్రంలో విలన్గా విశ్వరూపం చూపించి తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈయన నయన్కు విలన్గా మారితే.. స్క్రీన్పై రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.