ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక.. సోసల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ నెటిజన్.. ఐపీఎల్లో ఫేవరేట్ టీంతో పాటు క్రికెటర్ ఎవరని ప్రశ్నించగా అందుకు రష్మిక ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్లో తన ఫేవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకొచ్చింది.
కానీ, విరాట్ కోహ్లీ తన ఫేవరేట్ క్రికెటర్ కాదని..అతడి కంటే టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ధోనీ బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ తనకు ఎంతో ఇష్టమని.. అందుకే క్రీడలలో నా ఆల్ టైం హీరో ధోనీనే అని రష్మిక పేర్కొంది.