మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్?

ప్రముఖ నటుడు అర్జున్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తునానరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్.. పలు సినిమాల్లో ఇప్పటికే విలన్ గా నటించాడు. విలన్ గా ఆయన బాగా చేస్తుండటంతో అలాంటి ఆఫర్లే ఆయనకు ఎక్కువగా వస్తున్నాయి. సర్కారు వారి పాట సినిమాలో విలన్ పాత్రకోసం బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, కోలీవుడ్ నటుడు అరవిందస్వామి, ఉపేంద్ర, కిచ్చా సుదీప్ వంటి పలువురు పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు యాక్షన్ హీరో అర్జున్ ను విలన్ గా ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.