వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు.. తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది ఈ బ్యూటీ. ఇక ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో.. ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు సరసన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అయితే ప్రముఖ దర్శకుడు తేజ కూడా తన నెక్స్ట్ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట.
రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తేజ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తేజ కృతిని అప్రోచ్ అవ్వగా.. ఆమె మాత్రం సున్నితంగా నో చెప్పిందట. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.