సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మెగిపోతోంది. కరోనా విపత్కర సమయంలో ఎంతో మందికి సేవ చేస్తూ అండగా నిలుస్తున్నాడీయన. సాయం కోరిన వారికి కాదు, లేదు అనకుండా.. ఆదుకుంటూ అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నారు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోనూసూద్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకునే.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సోనూసూద్ను లైన్లో పెట్టి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్ను సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
సోనూ హీరోగా సరి కొత్త కథతో ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నడట. కాగా, ప్రస్తుతం క్రిష్ పవన్తో హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత సోనూసూద్తో సినిమా చేస్తాడని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.