ప‌వ‌న్ సినిమా.. అవ‌న్నీ పుకార్లే అంటున్న బండ్ల గ‌ణేష్‌!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే ఇటీవ‌ల గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గ‌ణేష్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు ప‌వ‌న్ అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే.

తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. దీంతో వీరి ప్రాజెక్ట్‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే..తాజాగా డైరెక్టర్ రమేష్ వర్మ పవన్ ను డైరెక్ట్ చేయనున్నారని, ఆ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తారని సోషల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

ఈ విషయంపై తాజాగా స్పందించిన గణేష్‌.. ఈ వార్తల‌న్నీ పుకార్లే అని తేల్చేశాడు.నిజంగా సినిమా ఫైనల్ అయితే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో రూమర్లను చెక్ పడి పవన్ అభిమానులకు ఒక క్లారిటీ దొరికేసింది.