ఇటీవల వకీల్ సాబ్తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఇటీవల గబ్బర్సింగ్ లాంటి బ్లాక్బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గణేష్తో కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. దీంతో వీరి ప్రాజెక్ట్పై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే..తాజాగా డైరెక్టర్ రమేష్ వర్మ పవన్ ను డైరెక్ట్ చేయనున్నారని, ఆ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
ఈ విషయంపై తాజాగా స్పందించిన గణేష్.. ఈ వార్తలన్నీ పుకార్లే అని తేల్చేశాడు.నిజంగా సినిమా ఫైనల్ అయితే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో రూమర్లను చెక్ పడి పవన్ అభిమానులకు ఒక క్లారిటీ దొరికేసింది.