వారి కోసం అనుష్క శర్మ కీలక సమాచారం..?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈమధ్యే ఓ ఆడబిడ్డకు వారు జన్మనిచ్చారు. దేశంలోని ప్రజలు ఎప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విరుష్క దంపతులు సాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో వారు మరోసారి ముందుకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేశారు.

తాజాగా అనుష్కశర్మ గర్భిణులకు, బాలింతలకు ఒక విలువైన సమాచారాన్ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ తో పాటు ఆ సంస్థ మెయిల్ ఐడీని షేర్ చేశారు. ఎలాంటి వైద్య సదుపాయం కావాలన్నా గర్భిణులు ఈ హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. ఈ హెల్ప్ లైన్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. హ్యాపీ టు హెల్ప్‌ అనే టాగ్ తో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ మహిళలకు సాయం అందిస్తోంది.