మహేష్ ఇంటి ముందు పెరిగిన‌ బందోబస్తు..కార‌ణం అదే?!

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా స్వ‌యం విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇక సినీ తార‌లంద‌రు కూడా క‌రోనా బారిన ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి, త‌మ‌న్నా, పూజా హెగ్డే, సోనూసూద్‌, నివేదా థామస్, దిల్ రాజు, జెనీలియా, ర‌కుల్ ప్రీత్ సింగ్, రాజ‌మౌళి ఇలా ఎంద‌రో క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ నేపథ్యంలో షూటింగ్స్ బంద్ చేసుకుని ఇంట్లోనే ఉంటున్న మహేష్‌బాబు మరింత అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద బందోబ‌స్తు భారీగా పెంచారట‌. ఇంట్లో పనిచేసేవాళ్లు మినహా మిగిలినవారిని ఎవరినీ ఇంట్లోకి రానివ్వడంలేద‌ని.. పైగా ఇంట్లో పని చేసేవారికి ప్రతి రోజు కరోనా టెస్టులు చేయిస్తున్నార‌ని తెలుస్తోంది. బయటనుంచి వచ్చేవారి కారణంగా కరోనా మహమ్మారి రాకూడదనే ఉద్దేశంతో మ‌హేష్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నార‌ట‌.