మ‌హేష్ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర అదేన‌ట‌..?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్‌కు సబార్డినేట్‌గా కీర్తి కనిపించబోతుందట‌.

ఇప్ప‌టికే మ‌హేష్ ఈ చిత్రంలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌హేష్ ప‌ని చేసే బ్యాంక్‌లోనే ఉద్యోగినిగా కీర్తి సురేష్ కనిపించబోతున్నారట. అంతేకాదు, హీరోయిన్ రోల్ గ్లామరస్‌గా మ‌రియు సినిమాకు హైలైట్‌గా ఉంటుంద‌ట‌. స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువే అని తెలుస్తోంది.