యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్కు పరిమితమైన ఎన్టీఆర్ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి చెప్పమని ప్రశ్నించగా.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ జక్కన్న ఈ ఇంటర్వ్యూ చదివితే.. కచ్చితంగా చదువుతాడు.. నేను గనుక ఏమైనా చెబితే నా వెనక చంపడానికి గొడ్డలి పట్టుకుని పరుగెడుతాడు అంటూ ఎన్టీఆర్ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
అలాగే ఆర్ఆర్ఆర్ ఓటీటీలో విడుదల చేస్తారా అని ప్రశ్నించగా.. అలాంటి ఆలోచన ఏమాత్రం లేదు. బాహుబలి, జురాసిక్ పార్క్, అవేంజర్స్ వంటి సినిమాలను ఓటీటీలో చూస్తారా? ఇది కూడా అంతే. కొన్ని విజువల్ వండర్స్ని థియేర్లలోనే చూడాలి అని ఎన్టీఆర్ బదులిచ్చాడు.