క‌రోనాతో హాస్ప‌ట‌ల్‌లో అభిమాని..చిరు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌!

దేశ వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ మాయ‌దారి వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. దొరికినోళ్ల‌ను దొరికిన‌ట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. సామాన్యులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌లు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది.

తాజాగా మెగాస్ట‌ర్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒక‌రికి క‌రోనా సోకి హాస్ప‌ట‌ల్‌లో చేరారు. అయితే అత‌డికి స్వ‌యంగా చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి చెందిన చిరంజీవి అభిమాని కరోనాతో కాకినాడలోని ఆసుపత్రిలో చేరాడు.

విషయం తెలిసిన మెగాస్టార్‌ నేరుగా అతడికి ఫోన్ చేసి.. చిరంజీవిని మాట్లాడుతున్నానని, ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. డాక్టర్‌తో మాట్లాడానని, త్వరగానే తగ్గిపోతుందని చెప్పారు. భయం వద్దని చెబుతూ అతడిలో మానసిక ధైర్యాన్ని నింపారు. క‌రోనా సోకిన ఒక అభిమానికి చిరు స్వ‌యంగా ఫోన్ చేయ‌డం నిజంగా విశేష‌మే. అందుకే చిరు చేసిన ప‌నికి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.