విజయ్ తో మళ్లీ నటిస్తా: రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా వీరిద్దరూ అలరించారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇక రష్మిక కూడా అల్లు అర్జున్ తో కలసి ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తోంది. అలాగే బిటౌన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’లో, అలాగే అమితాబ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వరుసగా రెండు సినిమాల్లో కలసి నటించగానే వచ్చిన రూమర్స్ తో కొంత కాలం కలసి నటించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ చెప్పాడు.

రష్మిక కూడా తామిద్దరి మధ్య ఉన్నది స్నేహం తప్ప వేరే ఏది కాదని స్పష్టం చేసింది. సరైన కథ​ దొరికితే, విజయ్​తో మరోసారి కచ్చితంగా నటిస్తానని తెలిపింది. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంటనే విజయ్ ఓకే చెప్పాడట. దాంతో పుష్పసినిమాతో పాటు ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేస్తున్నాడు సుక్కు. మరోవైపు లైగర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నారట.