విజయ్ సేతుపతి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక కేవలం హీరోగానే కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.
ఇక ఇటీవలె విడుదలైన ఉప్పెన సినిమాలో విలన్గా అద్భుతమైన నటను కనబరిచి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా.. అన్ని భాషల నుంచి ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మేరీ క్రిస్మస్` సినిమాలో విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
గోవాలో ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలని అనుకోగా.. ఇంతలోనే కత్రినాకు కరోనా సోకింది. ప్రస్తుతం కత్రినా కోలుకుంది. దీంతో వచ్చే నెలలో మొదటి వారమే తక్కువ సిబ్బందితో గోవాలో షూటింగు చేయబోతున్నారు. ఈ షెడ్యూల్లో కత్రినా మరియు విజయ్ కూడా పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ గోవాకు పయణమవ్వనున్నారట.