మ‌హేష్ హ్యాండిచ్చిన డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్ర‌స్తుతం ప‌వ‌న్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అదే స‌మ‌యంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు.

వీటి త‌ర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, బండ్ల గణేష్ ప్రొడక్షన్‌లో ఒక సినిమా, ప్రముఖ నిర్మాత జె.పుల్లారావు నిర్మాణంలో ఒక సినిమా ప‌వ‌న్ చేయ‌నున్నారు. అయితే వ‌కీల్ సాబ్‌ను నిర్మించిన దిల్ రాజు పవన్ తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించలేదు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం..ఈ సినిమా బాధ్యతలను దిల్ రాజు వంశీ పైడిపల్లి చేతిలో పెట్టాడ‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. ప్ర‌స్తుతం వంకీ ప‌వ‌న్ కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ రెడీ చేస్తున్నాడ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం. కాగా, స‌రిలేరి నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ వంశీ పైడిప‌ల్లితోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ, అక‌ర్లో.. మ‌హేష్ ఈ ప్రాజెక్ట్‌ను ర‌ద్దు చేసుకుని వంశీకి హ్యాండిచ్చిన సంగ‌తి తెలిసిందే.