నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ మే 31వ తేదీన 78వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కృష్ణ బర్త్డేను ఆయన తనయుడు, టాలీవుడ్ ప్రిన్స్ ఓ స్పెషల్ డేట్గా చూస్తుంటారు.
ఇక ప్రతి ఏడాది తండ్రి బర్త్డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తండ్రి బర్త్డే నాడు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట మహేష్. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
అయితే తండ్రి పుట్టినరోజుకు ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయాలని దర్శకుడికి మహేశ్ సూచించారట. ప్రస్తుతం పరుశురామ్ అదే పనిలో ఉన్నారట. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధి ప్రకటన కూడా మే 31న రానుందని తెలుస్తోంది.