అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్స్టోరీ`. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీహెచ్ పవన్ స్వరాలందిస్తున్నాడు.
ఈ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కానుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్కు నాగచైతన్య ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన విడుదల కానున్న లవ్స్టోరీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.
దీనికి సంబంధించి గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. పది రోజుల క్రితం శేఖర్ కమ్ముల సినిమా చూపించారు. అవుట్పుట్ చూసి చాలా ఆనందించా. అయితే గత రెండు వారాలుగా కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. అందుకే ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల సరైన సమయం చూసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.