టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఇటీవల ఎన్టీఆర్కు కథ చెప్పగా.. అది నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట.
అయితే ఈ చిత్రంకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కొద్ది సమయం పాటు ఎన్టీఆర్ అరవై ఏళ్ల వృద్దుడిగా కనిపించనున్నాడట. అలాగే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతోందట. ఏదేమైనా ఎన్టీఆర్ తన కెరీర్లో వృద్దుడిగా నటించింది లేదు. అలాంటి ఎన్టీఆర్ను వృద్దుడి పాత్రకు ఒప్పించాడు బుజ్జిబాబు.