మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డ బన్ని ఫ్యాన్స్!

ప్రముఖ టాలీవుడ్ అగ్ర బ్యానర్ కి దండ వేసి, హ్యాష్ ట్యాగ్ లతో నానా రచ్చ చేస్తూ బన్నీ ఫాన్స్ తాజాగా అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న బన్ని ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్ పై అలా తమ కోపాన్ని ప్రదర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. పుష్ప కి సంబంధించిన అప్ డేట్ కోరుతూ కోపంతో ఉన్న అభిమానులు ట్విట్టర్ లో # వేక్ ఆప్ మైత్రి మూవీ మేకర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను పెట్టారు.

అల్లు అర్జున్ పుట్టినరోజున కానుకగా ఎలాగైనా మైత్రి నుండి పుష్ప టీజర్ రావాల్సిందేనని అందుకే ఇలా కోపం ప్రదర్శించామని తెలిపారు. దీనికి మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ మూడు స్మైల్ ఎమోజీ లను షేర్ చేసింది. దీనికి సమాధానంగా మైత్రి మూవీ మేకర్స్ లోగోకు దండలు వేసి దానిని సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అయితే అల్లు అర్జున్ బర్త్ డే రోజున టీజర్ ని లాంచ్ చేసి మైత్రి సంస్థ ఆ కోపాన్ని చల్లారిస్తే కానీ ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం ఆగేలా కనిపించటంలేదు.