ఏపీలో వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ ఫీవర్ పట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారికి అయినా ఈ ఫీవర్ మామూలుగా లేదు. ఇప్పుడు అందరి నోట ప్రశాంత్ సర్వే మాటే వినిపిస్తోంది. ప్రశాంత్ ఏకంగా రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేసి గ్రామస్థాయి గ్రామస్థాయి వరకు రిపోర్టులు తయారు చేయించారు. ఈ సర్వే నివేదికలు జగన్ వద్దకు వెళ్లిపోయాయి. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినవి అన్నీ పాటిస్తున్నాడన్న లీకులు వైసీపీ నాయకులందరికి తెలిసిపోయాయి.
దీంతో ఇప్పుడు వైసీపీ నేతల్లో ఈ సర్వే గురించే ఒక్కటే చర్చ జరుగుతోంది. సర్వేలో ఎవరికి అనుకూలమైన ఫలితాలు వచ్చాయి ? ఎవరికి ప్రతికూల ఫలితాలు వచ్చాయన్నదానిపై పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. దీనికి తోడు సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల, వ్యతిరేకవర్గాలు ఇష్టమొచ్చినట్టు దీనిపై వార్తలు రాసేసుకుంటున్నాయి.
సర్వేలో కొంతమందికి వచ్చి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వవద్దని ప్రశాంత్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను బాగా టెన్షన్ పెట్టేస్తుందట. ఈ జాబితాలో 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 ఎంపీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ లిస్టులో ఎవరు ఉన్నామా ? అని వైసీపీ సిట్టింగ్లు టెన్షన్ పడుతున్నారు. ఏదేమైనా వైసీపీలో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఫీవర్ బాగా పట్టుకున్నట్టే కనపడుతోంది.