జ‌న‌సేన టాపిక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సీరియ‌స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంద‌రితోను చాలా క‌లుపుగోలుగా ఉండ‌డంతో పాటు అంద‌రిని ఆద‌రిస్తార‌న్న స‌ద‌భిప్రాయం ఆయ‌న‌పై అంద‌రికి ఉంది. ప‌వ‌న్ ఏ విష‌యంలోను ఎవ్వ‌రిని నొప్పించ‌కుండా ఉంటారు. అయితే అలాంటి ప‌వ‌న్‌కు ఓ వ్య‌క్తి చాలా కోపం తెప్పించ‌డంతో పాటు ప‌వ‌న్ ఆగ్ర‌హానికి గురయ్యాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ క‌మెడియ‌న్ ప‌వ‌న్‌తో మాటా మాటా క‌లిపి జ‌న‌సేన పార్టీ మ్యాట‌ర్ ఎక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది సార్ ? అని అడిగేశాడ‌ట‌. దీంతో ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చింద‌ట‌. వెంట‌నే ప‌వ‌న్ ఆ క‌మెడియ‌న్‌పై సీరియ‌స్ అయ్యాడ‌ట‌. జ‌న‌సేన పార్టీ గురించి అడ‌గ‌డంతో పాటు ? పార్టీ నిర్మాణం ఎక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింద‌ని అడ‌గ‌డంతో ప‌వ‌న్‌కు ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చేసింద‌ట‌. కాస్తంత హ‌ద్దుల్లో ఉండాల‌ని ప‌వ‌న్ ఆ క‌మెడియ‌న్‌ను హెచ్చ‌రించాడ‌ట‌.

ఇక డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సైతం నీ ప‌ని నువ్వు చూసుకో అని ఆ క‌మెడియ‌న్‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్టు సెట్లో ఉన్న వారి ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది. ఆ క‌మెడియ‌న్ త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల్లో కూడా న‌టించాడు. ఇప్పుడు ఈ మ్యాట‌ర్ ఇండ‌స్ట్రీలో జోరుగా ట్రెండ్ అవుతోంది.