యంగ్టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం టీజర్ రికార్డు స్థాయి వ్యూస్తో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ అయిన 24 గంటలకే 8 మిలియిన్ల డిజిటల్ వ్యూస్ సాధించిన ఈ టీజర్ 48 గంటలు కూడా కాకముందే ఏకంగా కోటి వ్యూస్ సాధించి టాలీవుడ్లో అల్లకల్లోలం రేపుతోంది. ఈ రేంజ్ వ్యూస్ సౌత్ ఇండియాలో స్టార్ హీరో రజనీకాంత్ కూడా ఇప్పటి వరకు దక్కించుకోలేకపోయాడు.
ఈ ఘనత ఎన్టీఆర్కు మాత్రమే ఎలా సాధ్యమైందా ? అని టాలీవుడ్లో అందరూ హీరోల అభిమానులు షాక్లో ఉన్నారు. ఈ ఒక్క టీజర్ దెబ్బత జై లవకుశ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో క్లీయర్గా తెలుస్తోంది. ఈ టీజర్కు వచ్చిన వ్యూస్ ఎన్టీఆర్ స్టామినాను, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ను కూడా చాటి చెప్పాయి.
టీజర్లో జై క్యారెక్టర్లో తన రాక్షసత్వాన్ని చూపించిన ఎన్టీఆర్ ఓ రేంజ్లో విజృంభించాడు. ఇక ఈ టీజర్ గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు బాగా చర్చించుకోవడం, షేర్లు చేయడం కూడా బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పవర్, సర్దార్ గబ్బర్సింగ్ చిత్రాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.