టాలీవుడ్లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ జోరందుకుంటోంది. ఇప్పటికే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ హీరోలు మహేష్బాబు, పవన్కళ్యాణ్ కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్రేజీ ఫ్యామిలీలు అయిన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీల నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్తేజ్, అక్కినేని అఖిల్ ఇద్దరూ డిజాస్టర్లనే ఎదుర్కొన్నారు.
వరుణ్ వరుస ప్లాపుల్లో ఉంటే అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు వీరిలో వరుణ్తేజ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా, అఖిల్ విక్రమ్కుమార్ డైరెక్షన్లో నటిస్తున్నారు. భారీ ప్లాప్లు ఎదుర్కొన్న వీరిద్దరు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరు మల్టీస్టారర్ సినిమాలో చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట.
అఖిల్తో మల్టీస్టారర్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు వరుణ్ ప్రపోజల్ పెట్టాడు. ఈ ప్రపోజల్కు అఖిల్ కూడా ఓకే చెపుతాడన్న చర్చలు నడుస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి, అక్కినేని ఫ్యామిలీకి క్లోజ్ రిలేషన్ ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ రావడం పెద్ద కష్టమేం కాదన్న టాక్ నడుస్తోంది. మరి వీరిద్దరి కాంబోలో సినిమా సెట్ చేసే డైరెక్టర్, నిర్మాత ఎవరవుతారో వెయిట్ అండ్ సీ..!