బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప అందుకే చంపాడ‌ట‌…సీక్రెట్ రివీల్‌

మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు మ‌రికొద్ది రోజుల్లో స‌మాధానం దొర‌క‌బోతోంది. మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ను చూసేందుకు యావ‌త్తు దేశం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. త‌మకు తెలిసిన వారి ద్వారా రిక‌మెండేష‌న్లు, సీట్ల బుకింగ్‌లు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేల థియేట‌ర్ల‌లో రిలీజ్‌! తెలుగు వారి స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పిన బాహుబ‌లి-2 ఫీవ‌ర్ మొద‌లైపోయింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడని తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్ర‌శ్న‌కు స‌మ‌ధానం ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చేసింది!

బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. జనాలకు ఒకటే ఉత్కంఠ. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని. అసలు ఈ ఒక్క పాయింట్ నే సెకెండ్ పార్ట్ కు అత్యంత కీలకం అన్నది దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిప్రాయం. చాలా తెలివిగా ఈ పాయింట్ ను జనాల్లోకి ఇంజెక్ట్ అయ్యేలా చేశారు. మొద‌టి పార్టును ఈ సీన్‌తో ముగించి.. రెండో పార్టుపై అంద‌రిలోనూ క్యూరియాసిటీ పెరిగేలా చేయ‌డంలో దర్శ‌కుడు రాజ‌మౌళి ఘ‌న విజ‌యం సాధించాడు. మరి కొద్ది రోజుల్లో ఈ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరికేస్తుంది. ఈ లోపు ఎవరికి తోచిన సమాధానం వారు చెబుతున్నారు.

ఈ ప్రశ్నకు కరెక్ట్‌ సమాధానం తాజాగా లీకైందట. బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణం శివగామి అట. బాహుబలికి వ్యతిరేకంగా శివగామికి భల్లాల దేవ, అతని తండ్రి బిజ్జల దేవుడు అసత్యాలు చెబుతారట. వాటిని నమ్మిన శివగామి బాహుబలిని చంపమని కట్టప్పను ఆదేశిస్తుందట. ఇదే బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణమని తెలుస్తోంది. కాగా, ‘బాహుబలి-2’ కథ పరంగా, డ్రామా పరంగా ‘బాహుబలి-1’ కంటే చాలా మెరుగ్గా ఉంటుందట. అలాగే కొన్ని సన్నివేశాలు, వార్‌ సీక్వెన్స్‌లు హాలీవుడ్‌ స్థాయిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక బాహుబలి 2 ఆద్యంత విజువల్ వండర్ అని మాత్రం అనిపించుకుంటుందట. స్కేల్, గ్రాండియర్ పార్ట్ వన్ కు డబుల్ రేంజ్ లో ఉన్నాయట. ఈసారి వాటిని హాలీవుడ్ స్టాండర్డ్ లోకి తీసుకెళ్లారట. కాగా, ఈ రెండో భాగంలో బాహుబలి (ప్రభాస్‌) విగ్రహాన్ని పైకి లేపే సీన్‌ అత్యద్భుతంగా వచ్చినట్టు వినికిడి. ట్రయిలర్ లో జనాలు తలెత్తి అబ్బురంగా చూసే సీన్ ఇక్కడిదే అని వినికిడి. టోటల్ సినిమాకు హైలైట్ గా నిలిచే సీన్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, కుంతల దేశ వ్యవహారాలు అన్నీ కూడా అలరిస్తాయిని తెలుస్తోంది.