యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిపోయాడు. బాహుబలి సినిమాకు ముందు వరకు ప్రభాస్ గురించి తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో ఎవ్వరికి తెలియదు. బాహుబలి – ది కంక్లూజన్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు ప్రభాస్ అంటే బాహుబలి అని అందరి మదిలో మెదులుతోంది. బాహుబలి సినిమా తెలుగులో ప్రాంతీయ భాషా చిత్రంగా తెరకెక్కి ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టింది.
ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా జనాలందరి కళ్లు బాహుబలి – ది కంక్లూజన్ మీదే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 28న వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటే తన అభిమానులకు మరో కానుకను కూడా అందించనున్నాడు. బాహుబలి 2 రిలీజ్ అయ్యాక ప్రభాస్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
సుజిత్ శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్ సినిమాను తెరకెక్కించాడు. ఇక రూ.150 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా తెలుగు – తమిళ – హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ను బాహుబలి 2తో పాటు రిలీజ్ చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘సాహో’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం.