టాలీవుడ్లో ఈ నెల నుంచి వచ్చే సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలే రిలీజ్కు రెడీ కానున్నాయి. ఈ సినిమాల్లో యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పాటు మెగాపవర్స్టార్ రాంచరణ్ తేజ్ ధృవ సినిమా కూడా వస్తున్నాయి. బాలయ్యకు శాతకర్ణి కేరీర్లో ల్యాండ్ మార్క్ సినిమా. ఇక చెర్రీకి రెండు ప్లాపుల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ధృవ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఈ రెండు సినిమాల్లో శాతకర్ణిపై అటు నందమూరి అభిమానుల్లోను, ధృవపై ఇటు మెగా అభిమానుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ రెండు ప్రతిష్టాత్మక సినిమాల టీజర్లు ఈ సదరాకు రిలీజ్ అయ్యాయి. కొద్ది గంటల గ్యాప్ తో విడుదలైన ఈ టీజర్లు యూట్యూబ్లో రిలీజ్ అయ్యి పోటా పోటీ వ్యూస్తో దూసుకుపోతున్నాయి.
దసరా కానుకగా అక్టోబర్ 10 ఉదయం రిలీజ్ అయిన బాలయ్య శాతకర్ణి టీజర్ సాయంత్రానికే మిలియన్ మార్క్ వ్యూస్ను సాధించింది. శాతకర్ణి టీజర్ ఇప్పటి వరకు 24,30,992 వ్యూస్ సాధించింది. ఇక అదే రోజు సాయంత్రం రిలీజ్ అయిన చెర్రీ ధృవ టీజర్ బాలయ్య శాతకర్ణిని దాటిపోయి 3 మిలియన్ మార్కును సులభంగా అధిగమించింది. ఇప్పటి వరకూ ఈ టీజర్ కు 3,153, 923 హిట్స్ లభించాయి.
ఈ రెండు సినిమాలలో ధృవ డిసెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, శాతకర్ణి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఒకే రోజు రిలీజ్ అయ్యి యూ ట్యూబ్లో ఫైట్ చేసుకున్న ఈ రెండు టీజర్లలో శాతకర్ణిపై ధృవ పైచేయి సాధించింది.