టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి ప్రాజెక్టు ప్రభాస్ మైండ్ సెట్నే మార్చేసిందా అన్న టాక్ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో స్టార్ట్ అయ్యింది. బాహుబలి తర్వాత ప్రభాస్ వచ్చే సమ్మర్లో బాహుబలి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాహుబలి-2 సైతం ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది.
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ తన సొంత బ్యానర్ లాంటిదైన యూవీ క్రియేషన్స్లో రెండు సినిమాలకు కమిట్ అయినట్టు తెలుస్తోంది. వీటిలో ముందుగా రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్లో ఒకటి, జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు. అయితే ఇక్కడే ప్రభాస్ లెక్క తప్పుతున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్, క్రేజ్ రెండూ పెరిగాయి ఆ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే బాహుబలి విజయం వెనక చాలా మంది టాలెంట్ ఉంది. ఈ విజయంలో మేజర్ క్రెడిట్ రాజమౌళిదే..ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ప్రభాస్ సుజీత్తో చేసే సినిమాకు ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్నాడట. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, మాళయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనేది మనోడి ప్లాన్గా తెలుస్తోంది.
బాహుబలి రేంజ్ వేరు…దానికి ఉన్న క్రేజ్ వేరు. మరి దాన్ని బేస్ చేసుకుని ప్రభాస్ సుజీత్ను నమ్ముకుని అంత బడ్జెట్ పెట్టడం రిస్కేనన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా తలక్రిందులవ్వాల్సిందే. బాహబలి-2 తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమా మీద భారీ అంచనాలే ఉంటాయి. అంత మాత్రన ఇంత రిస్క్ చేయడం కరక్టేనా అన్నది ప్రభాస్కే తెలియాలి.