చిరు 150+ ఆటోజానీ ఊయ్య‌ల‌వాడ న‌ర‌సింహారెడ్డి!

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమాతో మ‌ళ్లీ చిరు సినిమా ప్ర‌స్థానం మొద‌లైంది. ఇక నుంచి వ‌రుస‌గా చిత్రాల‌ను తీయాల‌ని మెగాస్టార్ భావిస్తున్నాడు.

150 సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే…త‌దుప‌రి సినిమాల‌పై చిరు దృష్టిపెట్టారు. 151 సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న దానిపై అటు ప్యాన్స్‌లోనూ, ఇటు ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. నిజానికి చిరు 150 సినిమాను ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తీయాల్సి ఉంది. కానీ..ఆయ‌న రాసిన క‌థ‌లో..ప్ర‌ధానంగా సెకండ్ ఆఫ్ స‌రిగా లేక‌పోవ‌డం, మెగాస్టార్ అసంతృప్తిగా ఉండ‌టంతో ప్రాజెక్ట్ ప‌క్క‌ను వెళ్లిపోయింది. ఆ ప్లేస్‌లోకి వివి వినాయ‌క్ వచ్చాడు. క‌త్తి రీమేక్‌ను ఆయ‌న తెర‌కెక్కిస్తున్నాడు.

కానీ పూరి మాత్రం చిరుతో సినిమా తీయాల్సిందేనంటున్నాడు. ఆయ‌న రాసిన ఆటోజానీ క‌థ‌కు తుదిమెరుగులు దిద్ది చిరంజీవికి చూపించిన‌ట్లు స‌మాచారం. ఆ క‌థ విన్న ఆయ‌న షాక్ అయిన్న‌ట్లు తెలుస్తోంది. మొద‌టి సారి కంటే ఈ సారి క‌థ చాలా అద్భుతంగా ఉంద‌ని చెప్పిన‌ట్లు ఫిల్మింన‌గ‌ర్‌లో టాక్.

ఏది ఏమైన మాస్ ద‌ర్శ‌కుడు మెగాస్టార్‌తో సినిమా తీయాల్సిందేనంటున్నాడు. 151వ సినిమా కాక‌పోతే ఇంకొ సినిమా అయిన నాదే అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాడూ పూరి. ఇటీవ‌లే మ‌రో ద‌ర్శ‌క‌దిగ్గ‌జం బోయ‌పాటి కూడా చిరుకు క‌థ‌ను వినిపించిన‌ట్లు స‌మాచారం. ఆ క‌థ‌కు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి ఎప్పుడో తీస్తాడ‌నుకున్న ఊయ్య‌ల‌వాడ న‌ర‌సింహారెడ్డి టైటిల్‌తో బోయ‌పాటి మంచి క‌థ చెప్పిన‌ట్లు…అది ఆయ‌న‌కు బాగా న‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ఇన్ఫ‌ర్‌మెష‌న్.
చిరంజీవి త‌దుప‌రి సినిమాను ఏ ద‌ర్శ‌కుడు తీస్తాడన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఆ ఇద్ద‌రు ఇద్ద‌రే కాబ‌ట్టి…ఎవ‌రు సినిమా తీసిన బాక్స్ బ‌ద్ద‌లు కావాల్సిందే.