టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో కోలుకోలేని ఎదురు దెబ్బ తగలనుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగనుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడడంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారట. […]
Tag: telangana tdp
టీడీపీ లో కలకలం .. అక్కడ గట్టి ఎదురుదెబ్బే !
2019 ఎన్నికలకు ఇంకా గట్టిగా యేడాదిన్నర టైం కూడా లేదు. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజకీయం హీటెక్కిస్తోంది. ఈ క్రమంలోనే జంపింగ్లు, కప్పుల తక్కెడలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సదరు మాజీ మంత్రి ఏపీకి చెందిన వారు కాదు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే అస్థిత్వం కోసం ఫైట్ చేయాల్సిన […]
తెలంగాణలో బద్ధశత్రువుతో టీటీడీపీ దోస్తీ ..!
కొత్త మిత్రుడి కోసం టీటీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం బీజేపీతో మైత్రి కొనసాగుతున్నా.. ఎప్పుడు కమలనాథులు కటీఫ్ చెప్పేస్తారో తెలియని పరిస్థితి. దీంతో తమ మనుగడ కాపాడుకునేందుకు సరికొత్త పొత్తుల కోసం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. శత్రువులతోనూ చేతులు కలిపేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. అంతేగాక మరో అడుగు ముందుకేసి చర్చలు కూడా ప్రారంభించిందని సమాచారం! శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించాలని డిసైడ్ అయిపోయింది. అందుకే బద్ధశత్రువైన కాంగ్రెస్తో కూడా దోస్త్ మేరా […]
పునర్విభజనపై గందరగోళంలో టీడీపీ – బీజేపీ
పునర్విభజన ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా తహతహలాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం మాటెలా ఉన్నా.. ఈ పునర్విభజన గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో తెగ చర్చలు జరుపుతున్నారట. ఆయన్ను కలిసిన ప్రతిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నారట. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మరో అడుగు ముందుకేసి.. మరో నెలరోజుల్లోనే పునర్విభజన ఉంటుందని ప్రకటించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హరిబాబు బ్రేక్ వేశారు. […]
మరో వ్యూహంతో టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్
కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్న నల్గొండను టార్గెట్ చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలందరికీ ఒకేసారి సమాధానం చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాక టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన.. ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో.. నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించి, ప్రజల్లో టీఆర్ఎస్కు ప్రజాదరణ ఉందని కాంగ్రెస్కు తెలిసొచ్చేలా చేసేందుకు వ్యూహాత్మకంగా […]