రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా.. నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి తనను అధికారంలోకి తీసుకొస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల సభలు, సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వరకూ ప్రజల్లోకి వెళ్లాయి. నేతలు వీటిని సక్రమంగా ప్రచారం చేస్తున్నారా? లేదా అనే అంశాలపై వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. […]
Tag: Prashanth kishor
నంద్యాల ఫలితం తర్వాత…. పీకే-జగన్ మధ్య ఏం జరిగింది
నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్లో మార్మోగింది. నార్త్లో ప్రధానమంత్రి మోడీ నుంచి పలు రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా సక్సెస్ ఫుల్ రిజల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రావడంతో అందరి దృష్టి ఆయనమీదే ఉంది. ఆయన వ్యూహాలు ఇక్కడ కూడా వైసీపీకి పని చేస్తాయన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీకే తన వ్యూహాలు అమలు చేశారు. […]
పీకే గాలి తీసేసిన వాసిరెడ్డి పద్మ
రాజకీయాలన్నాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మెట్టు పొరపాటున దిగామా? వంద మెట్ల కిందకి తోసేసేందుకు అంతా కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త, ఉత్తరాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఐఐటీయెన్ ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకే పరిస్థితి ఇలానే ఉంది!! ఎన్నో ఆశలతో ఢిల్లీ నుంచి పీకేని దిగుమతి చేసుకున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే ఏపీలో పాగా వేయాలని దృఢంగా నిర్ణయించుకున్న జగన్.. ఆదిశగా తనను, తన పార్టీని, నేతలను నడిపించేందుకు […]
వ్యూహకర్తలకు ఏపీలో ప్లేస్ లేదా?
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అనగానే ముందుగా ఏపీ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని నియమించుకున్నందుకు కాదు.. వ్యూహకర్త అనే కొత్త మాట విని అవాక్కయ్యారు. నిజమే.. ఇప్పటివరకూ ఇటువంటి పదాన్ని వినలేదు ఏపీ ప్రజలు! ఎన్నికల్లో గెలవడానికి సీనియర్ నాయకుల దగ్గరే బోలెడన్ని వ్యూహాలు ఉంటే.. కొత్తగా వీటన్నింటినీ అమలు చేయడానికి వేరే ప్రాంతంపు వ్యక్తి ఎందుకో అని సన్నాయినొక్కులు కూడా నొక్కిన వాళ్లు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ పీకేల వల్ల ఏపీలో […]
పీకే ప్రాధాన్యం వైసీపీలో తగ్గినట్టేనా?
పార్టీలో నేతలు ఎంత మంది వద్దని చెప్పినా వినలేదు! ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్న చందంగా.. పార్టీలోని సీనియర్లను కూడా పక్కనపెట్టి.. అందరి కంటే ఎంతో ప్రాధాన్యమిచ్చారు! ఎంతమంది వ్యతిరేకించినా.. అవేమీ పట్టించుకోకుండా అందల మెక్కించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన సలహాలు విజయానికి ఎంతో సహాయపడతాయని ఊహల్లో తేలియాడారు. కానీ ఇప్పుడు అవన్నీ నీళ్లపాలు అయిపోయాయి. ఏరికోరి తెచ్చుకున్న వ్యూహకర్త పీకే దెబ్బ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు గట్టిగా తగిలింది. ఈ […]
పీకే సలహా.. వాడుకుని వదిలేయడమే!
ఏపీ విపక్షం వైసీపీలో ఇప్పుడు నేతలకు కంటిపై కునుకు కరువవుతోంది. ప్రస్తుతం పార్టీనే అంటి పెట్టుకుని జగన్కి అన్ని విధాలా ఉపయోగపడి, ఆయన కష్టాల్లోనూ పాలు పంచుకుని అన్ని విధాలా నష్టపోయి కూడా పార్టీలోనే కొనసాగతున్న వారికి అస్సలు నిద్ర ఉండడం లేదట! అంతేకాదు.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో నని వారు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ విషయంలోకి వెళ్లే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార టీడీపీని మట్టి కరిపించి తాను అధికారంలోకి రావాలని ప్లాన్ […]
పీకే సర్వేలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలపై యాంటీ రిపోర్ట్
`ప్రజలకు నిరంతరం చేరువకావాలి. వారికి అందుబాటులో ఉండాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలి` ఇదీ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నమాట. పలు సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి సెగలు రగులుతున్నాయన్న విషయం గ్రహించిన ఆయన ఇలా చెబుతున్నా.. వారు మాత్రం తీరు మార్చుకోవడం లేదట. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ఏరికోరి తెచ్చుకన్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలోనూ ఇదే ఫలితాలు రావడంతో వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. కేవలం వైసీపీ నేతల […]
సీన్ రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక పీకే
2019లో ఎలాగైనా సరే ఏపీలో సీఎం సీటును కైవసం చేసుకుని తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్ అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. బిహార్కు చెందిన ఐఐటీయెన్, గతంలో 2014 ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ను ఖరీదు ఎక్కువైనా భరాయించి మరీ జగన్ తన సలహాదారుగా నియమించుకున్నాడు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలకు రెండేళ్లకు పైగానే సమయం ఉండగా… పీకే మాత్రం రంగంలోకి దిగిపోయాడు. జగన్కి పలు […]
పీకే సర్వే పక్కదారి పడుతోందా? జగన్కు నిజాలు తెలిసే అవకాశం లేదా?
వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం సీటును అధిరోహించి కనీసం 30 ఏళ్లకు తగ్గకుండా రాష్ట్రాన్ని పాలించాలని తనకు ఉందని ఆయన మొన్నామధ్య విజయవాడలో జరిగిన ప్లీనరీ సందర్భంగా భారీ ఎత్తున ప్రకటించాడు కూడా. ఈ క్రమంలోనే ఆయన రాజకీయంగా తనకు ఎంత చాతుర్యం ఉన్నా.. ఎన్నికల్లో గెలిచేందుకు ఆవగింజంత అయిడియా కావాలని భావించి.. ఖరీదు ఎక్కువైనా ఎన్నికల వ్యూహ కర్తగా పేరు పొందిన […]