వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలలో టెన్షన్..టెన్షన్

ఏపీలో వైసీపీ నేత‌ల‌కు ప్ర‌శాంత్ కిషోర్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న‌వారికి అయినా ఈ ఫీవ‌ర్ మామూలుగా లేదు. ఇప్పుడు అంద‌రి నోట ప్ర‌శాంత్ స‌ర్వే మాటే వినిపిస్తోంది. ప్ర‌శాంత్ ఏకంగా రూ. 8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసి గ్రామ‌స్థాయి గ్రామ‌స్థాయి వ‌ర‌కు రిపోర్టులు త‌యారు చేయించారు. ఈ సర్వే నివేదిక‌లు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లిపోయాయి. జ‌గ‌న్ కూడా ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన‌వి అన్నీ పాటిస్తున్నాడ‌న్న లీకులు వైసీపీ నాయ‌కులంద‌రికి తెలిసిపోయాయి. దీంతో […]

ఈ టీడీపీ సిట్టింగ్ ఎంపీల‌కు 2019లో సారి

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ సారి టిక్కెట్ల విష‌యంలో కాస్త క‌టువుగానే వ్య‌హ‌రిస్తారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి వ‌రుస‌గా ఏపీకి రెండో సీఎం అయ్యేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న బాబు చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేయ‌నున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 4 సీట్లు ఇవ్వ‌గా 21 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో […]

బ్రాహ్మ‌ణి – జ‌య‌దేవ్ డీల్ ఇదే

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు పొలిటిక‌ల్ ఎంట్రీపై గ‌త ఆరేడు నెల‌లుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న కోడ‌లిని ఎంపీగా పోటీ చేయిస్తార‌ని…ఇందుకోసం విజ‌య‌వాడ‌, గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి వ‌ర‌కు బ్రాహ్మ‌ణి విజ‌య‌వాడ నుంచి పోటీ చేస్తుంద‌ని కొంద‌రు అనుకున్నా…ఇప్పుడు ఈ సీటుపై బీజేపీ క‌న్నేయ‌డం.. పురందేశ్వ‌రి, కేంద్ర మంత్రి వెంక‌య్య కుమార్తె దీపా పేర్లు ఇక్క‌డ నుంచి విన‌ప‌డ‌డం, మ‌రోవైపు మాజీ ఎంపీ […]

చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు క‌ల‌వ‌ని ఎంపీ -ఎమ్మెల్యే

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు ఓ ప్రాధాన్య‌త ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటోన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తుంటే ప్ర‌ధాన పార్టీల నాయ‌కుల మ‌ధ్య చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు మాత్రం క‌ల‌వ‌డం లేదు. అధికార టీడీపీ విష‌యానికే వ‌స్తే ఇక్క‌డ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీత‌ల సుజాత వ‌ర్గాలు ఉన్నాయి. ఈ రెండు వ‌ర్గాల‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఒక‌రు ఎడ్డెం అంటే మ‌రొక‌రు తెడ్డం అనే […]

క‌ల‌క‌లం: వైసీపీలోకి కేశినేని నాని..!

ఈ వార్త‌లో నిజానిజాలు ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే విజ‌య‌వాడ‌లోని ఓ వ‌ర్గం నాయ‌కులు మాత్రం ఇదే ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ చేప‌ట్టిన ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు సైకిలెక్కేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన కొత్త నాయ‌కులు, పాత నాయ‌కుల మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డంతో పాత టీడీపీ నాయ‌కులు ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో […]

వైసీపీకి ఎంపీ అభ్య‌ర్థులు కావ‌లెను..?

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే టార్గెట్‌గా ముందుకు వెళుతోన్న విప‌క్ష వైసీపీ ప‌రిస్థితి మూడు అడుగులు ముందుకు…ఆరు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హాలు ఫాలో అవుతోన్న జ‌గ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్నా లోక్‌స‌భ నియోజ‌క‌వర్గాల‌ను లైట్ తీసుకుంటున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి, అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి […]

చంద్ర‌బాబుతో టీడీపీ ఎంపీ తాడో.. పేడో..!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. నిన్న బెంజ్ స‌ర్కిల్‌వ‌ద్ద ఫ్లైవోవ‌ర్‌కి శంకు స్థాప‌న చేసిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న ర‌వాణా శాఖ‌పై ఓ రేంజ్‌లో ఫైర‌య్యాడు. అవినీతికి చిరునామాగా ర‌వాణా శాఖ ఉంద‌ని భారీ కామెంట్ చేశాడు. నిజాయితీ గ‌ల టీడీపీ కార్య‌క‌ర్త‌గా తాను సిగ్గుప‌డుతున్నాన‌ని అన్నారు. ర‌వాణా శాఖ అవినీతి వ‌ల్లే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే.. కేశినేని ఇదంతా ఏదో వ్యూహం ప్ర‌కారం చేస్తున్న‌ట్టే […]

వైసీపీ సిట్టింగుల‌లో 16 మందికి టిక్కెట్లు లేవా

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌న ప‌ని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్ప‌టికే వైఎస్‌.జ‌గ‌న్‌ను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు మకాం మార్చేయాల‌ని చెప్పిన ప్ర‌శాంత్ ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న వారిలో కొంద‌రికి టిక్కెట్లు ఇవ్వ‌కూడ‌ద‌ని కూడా జ‌గ‌న్‌కు ప్రాధ‌మిక నివేదిక ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ ప్రాధ‌మిక నివేదిక‌లో ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీల‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తిరుప‌తి […]

భూకుంభ‌కోణంలో ఆ ఎంపీ పేరు బ‌య‌ట‌కు రావడంతో ఇర‌కాటంలో టీఆర్ఎస్

మియాపూర్ భూకుంభ‌కోణం తెలంగాణ‌లోని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సెగ‌లు రేపుతోంది. తాజాగా ఈ వివాదంలో టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేకేకు చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. మియాపూర్ వేల కోట్ల భూకుంభ‌కోణం కేసులో రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కేశ‌వ‌రావు ప్రమేయం ఉన్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది. ఇప్పటికే హైదరాబాద్‌లో వందల ఎకరాల ప్రభుత్వ భూములకు ఎసరుపెట్టిన ‘గోల్డ్‌స్టోన్‌’ సంస్థ తన దొంగ సొత్తులో ఆయన కుటుంబానికీ భాగం పెట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ, అటవీ […]