టీఆర్ఎస్‌లో ముగ్గురు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎంపీలు

రాజ‌కీయ పార్టీ అన్నాక ప్ర‌జాప్ర‌తినిధులు నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు, ఎత్తులు పై ఎత్తులు కామ‌న్‌. అధికార పార్టీ అయితే అధికారం చేతిలో ఉంటుంది కాబ‌ట్టి ఇవి కాస్త ఎక్కువే ఉంటాయి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఇలాంటి ఆధిప‌త్య పోరే న‌డుస్తోంది. మంత్రులు వ‌ర్సెస్ ఎంపీల మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ కోల్డ్‌వార్ మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎంపీల మ‌ధ్య జ‌రుగుతోంది. పాల‌మూరు జిల్లాలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు జిల్లాపై ఆధిప‌త్యం చెలాయిస్తుండ‌డం […]

రాజ‌కీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్‌ ఖ‌రారైన‌ట్టే

ఏపీలో రాజ‌కీయ పోరు నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ఉన్నా పవ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? అని ప్ర‌శ్నించుకుంటే ప్ర‌స్తుతానికి జ‌న‌సేన ప్ర‌భావం కొన్ని చోట్ల మాత్ర‌మే ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు […]

రాజీనామా చేయాలని జ‌య‌దేవ్‌కు బాబు వార్నింగ్

గుంటూరు ఎంపీ, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బావ గ‌ల్లా జ‌య‌దేవ్‌పై ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. జ‌య‌దేవ్‌కు చంద్ర‌బాబు వార్నింగ్ ఇవ్వ‌డం వెన‌క ఏపీ ఒలంపిక్ అసోసియేష‌న్ వివాద‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఏపీ ఒలంపిక్ సంఘం అసోసియేష‌న్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం గ‌ల్లా జ‌య‌దేవ్, క‌డ‌ప జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం.ర‌మేశ్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో ఫైటింగ్ జ‌రిగింది. గ‌త రెండేళ్లుగా వీరు ఏపీ ఒలంపిక్ సంఘం త‌మ‌దంటే త‌మ‌దే […]

బీజేపీలో కేశినేని మంట‌

ఏపీలో అధికార ప‌క్షంలో ఉన్న టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట రేగుతోంది. గ‌త మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా మంట రేపుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్య‌ల‌పై బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌నేత‌, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వ‌ల్లే […]

ఆ జిల్లాలో ముగ్గురు ఎంపీల‌కు బాబు టిక్కెట్ ఇవ్వ‌డ‌ట‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పెద్ద షాకింగ్ డెసిష‌న్ తీసుకోబోతున్నారా ? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌రా ? అంటే ప్ర‌స్తుతం ఆ జిల్లాలో వినిపిస్తోన్న రాజ‌కీయ చ‌ర్చ‌ల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. ఏపీలోని పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. రాజ‌మండ్రి నుంచి సినీన‌టుడు మాగంటి ముర‌ళీమోహ‌న్‌, […]

టీఆర్ ఎస్‌లో స‌ర్వే మంట‌లు.. ప్ర‌జాద‌ర‌ణ కోల్పోతున్న నేత‌లు

2014లో ఓ ప్ర‌భంజ‌నం మాదిరిగా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీకి ముచ్చ‌ట‌గా మూడేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో రెండేళ్ల‌లో 2019 ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు కేసీఆర్ ఇప్ప‌టి నుంచే త‌న సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో అధికార పార్టీకి, నేత‌ల‌కు ఉన్న బ‌లాబ‌లాల‌ను, అభిప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో నే ఇటీవ‌ల నేత‌ల ప‌నితీరు ఆధారంగా స‌ర్వే చేయించారు. గ‌తంలోనూ ఒకసారి ఈ […]

టీఆర్ఎస్ నేతలకు న‌యా టెన్ష‌న్‌..!

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై సీఎం కేసీఆర్ వ‌రుస‌గా స‌ర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. స‌ర్వేల్లో ప‌నితీరు స‌క్ర‌మంగా లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ వ‌రుస‌గా వార్నింగ్‌ల మీద వార్నింగులు ఇస్తున్నారు. మ‌రికొంద‌రికి అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు కూడా క‌ష్ట‌మే అని తేల్చేశార‌ట‌. ఇక జూన్ 2వ తేదీనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 27న కేసీఆర్ పార్ల‌మెంట‌రీ శాస‌న‌స‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశంలో మూడో […]

కోట‌గిరికి జ‌గ‌న్ షాక్‌… ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటుకు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం నిన్న‌టి వ‌ర‌కు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల వార‌సుల‌ను వ‌రుస‌గా త‌న పార్టీలో చేర్చుకున్న జ‌గ‌న్ ఇప్పుడు స‌రికొత్త వ్యూహంతో వారికి ఒక్కొక్క‌రిగా షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. జ‌గ‌న్ కొద్ది రోజుల క్రితం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన దివంగ‌త సీనియ‌ర్ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌కు ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. శ్రీథ‌ర్ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్టు త‌న‌దే అన్న […]

ఆంధ్ర ఎంపీకి కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీసులో అవమానం

అమలాపురం దళిత ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని అయితే అక్కడ ఉన్న సీఎం క్యాంప్‌ ఆఫీసు సిబ్బంది తీవ్రంగా అవమానించారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంపీ అని చెప్పిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు అన్నారు . సీఎం లేరని భద్రతా సిబ్బంది చెప్పారని, పేషీలో కార్డు ఇస్తానంటే వినలేదన్నారు. పార్లమెంటు సభ్యుడి గుర్తింపు కార్డు చూపినా […]