కేటీఆర్ ఏం స్పెషలా అంటున్న రేవంత్

ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. అందులోనూ రాష్ట్ర మంత్రి.. రాష్ట్రంలో ఆయన చెప్పింది జరిగి తీరాల్సిందే.. అతనే కేటీఆర్..అయితే కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఇపుడు నేరుగా విమర్శణాస్ర్తాలు సంధిస్తున్నాడు. పవర్ ఉన్న వ్యక్తి నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు పట్టించుకోరా అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని నిలదీస్తున్నాడు. కేటీఆర్ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద […]

రవీందర్ కు అడ్డు వచ్చిన బండి..

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కినుకు వహించిన రవీందర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల్లో విజయం కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఈయన విజయానికి మాజీ టీఆర్ఎస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓటు […]

వారిని అదుపు చేయకపోతే కష్టమే..

కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తరువాత అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు సాగించలేదు. ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై .. ఇపుడు మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ఆమె ద్రుష్టి మొత్తం నిజామాబాద్ ఎంపీ స్థానంపైనే ఉంది. రెండున్నరేళ్లుగా జిల్లా పార్టీని పెద్దగా పట్టించుకోని కవిత ఇటీవల జిల్లాలో పర్యటిస్తున్నారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలు, నాయకులకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు ఆమెకు జిల్లాలోని […]

మంత్రి మల్లారెడ్డి అంటే అంతే..

విద్యాసంస్థల అధినేత, మంత్రి మల్లారెడ్డి అంటే అంతే.. ఆయన రూటే సపరేటు.. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే.. ఇపుడు ఆయన వ్యవహార శైలి మాత్రం మేడ్చల్ జిల్లాలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా భూ సమస్యలు, భూ కబ్జాలను ప్రోత్సహించడం, రియల్ వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం లాంటివి చేస్తున్నాడని పార్టీలోని పలువురు నాయకులు పార్టీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే ఇంత జరుగుతున్నా తనకు కేసీఆర్, కేటీఆర్ తనకు బాగా క్లోజ్ […]

కారులో ఇమడలేకపోతున్న పొంగులేటి

ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇపుడు పార్టీలో కష్టకాలం వచ్చిందట. గతంలో వైసీపీలో ఉన్నపుడు ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకపోవడం, ఏపీపైనే పూర్తిగా ద్రుష్టి సారించడంతో పొంగులేటి కారు పార్టీ వైపు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే చురుగ్గా ఉంటున్నారు. అయితే కొద్ది కాలంగా పొంగులేటికి గులాబీ నేతల నుంచి సహకారం లభించడం లేదని, అధిష్టానానికి ఆయన […]

ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

కేటీఆర్‌ సార్‌.. మేయర్‌ గారెక్కడ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్లందరికీ కాదు కదా సొంతపార్టీ కార్పొరేటర్లకు కూడా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అందుబాటులో ఉండటం లేదు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మేయర్‌ ను కలిసి వివరిద్దామనుకుంటే వారికి నిరాశే ఎదురవుతోంది. మాకే మేయర్‌ అందుబాటులో లేకపోతే మేం ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించగలం? అని వాపోతున్నారని సమాచారం. 2021 ఫిబ్రవరిలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి పేరు బయటకు రావడం.. ఆమెను […]

రేపే ఫస్ట్ మీటింగ్.. టెన్షన్.. టెన్షన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా […]

ఫస్ట్ ఎటు పోదాం సామీ?

ఆయనంటే రాజకీయ నాయకులకు ఓ నమ్మకం.. ఓ భరసా.. తమ పార్టీని అధికారంలోకి తెస్తాడనే ఆశ.. అలా చేశాడు కూడా.. కావాల్సినంత డబ్బులిస్తే తన మేధస్సు ఉపయోగించి ఎలాగైనా పవర్ తెప్పిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు.. అలా జరుగుతోంది కూడా. ఆయనే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. అలాంటి వ్యక్తే ఇపుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ఏ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల విషయంలో. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని మాటిచ్చాడు. […]